దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయనాయకులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2021-22 గాను భారత ఎగుమతులు సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 418 బిలియన్ డాలర్లను తాకేశాయి. ఈ నేపథ్యంలో గోయల్ మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు. 750 కోట్ల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచిందని విన్నాను. ఆర్ఆర్ఆర్ చిత్రం లాగే ఇండియన్ ఎకానమీ కూడా రాకెట్లా దూసుకుపోతుందని పీయూష్ గోయల్ అన్నారు.