39.2 C
Hyderabad
April 28, 2024 13: 09 PM
Slider మహబూబ్ నగర్

పోడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రణభేరి

#congresspartykalwakurthy

పొడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రోడ్లు భవనాల అతిథిగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూనల్లమలలో పోడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వంశీకృష్ణ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో రణభేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పొడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు అతీగతీ లేదని దుయ్యబట్టారు. డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక ల పేరుతో దళిత భూములను టిఆర్ఎస్ నాయకులు బలవంతంగా తీసుకుంటున్నారని, గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు గిరిజనులకు ఇచ్చిన భూములను పట్టాలను ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని, 2018 ఎన్నికల ముందు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి రైతులను మరోసారి మోసం చేశారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా మరోవైపు ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి తిరిగి ఆక్రమించుకునే విధంగా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిరసనగా కాంగ్రెస్ రణభేరి మ్రొగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మన్ననూర్ అంబేద్కర్ చౌరస్తా ఈనెల 15న మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రణభేరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కోదండ రెడ్డి, కోదండరాం హాజరవుతున్నట్లు అతిథులుగా నాగం జనార్ధన్ రెడ్డి చిన్నారెడ్డి మల్లురవి వంశీచంద్రెడ్డి సంపత్ కుమార్ అద్దంకి దయాకర్ బెల్లంనాయక్ అన్వేష్ రెడ్డి ఒబేదుల్లా కొత్వాల్, శంకర్ ప్రసాద్ పటేల్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రెడ్డి జంగయ్య పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

చంద్రబాబు తో విద్యార్ధి నేత పోలి శివకుమార్ భేటీ

Satyam NEWS

జాతీయ రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment