33.7 C
Hyderabad
April 30, 2024 00: 06 AM
Slider హైదరాబాద్

మొగుళ్లపల్లి ఉపేందర్ కు ఉగాది పురస్కారం

సమాజ సేవలో గిన్నిస్ అవార్డ్ పొందిన ఉపేందర్ మొగుళ్లపల్లి కు ఉగాది పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొగ్గారాపు దయానంద్, తెలంగాణ రాష్ట్రా టూరిజాం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఉగాది పురస్కారం ఆయన కు అందించారు.

ఈ కార్యక్రమంలో గడ్డిన్నారం ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు చింతల బాలరాజ్ GHMC చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ప్రముఖ సినీ నటులు పసూనూరి శ్రీనివాస్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాను చేసిన అతిముఖ్యమైన సేవా కార్యక్రమాలు గుర్తించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు లభించిందని ఉపేంద్ర తెలిపారు.
ప్రతి సం 50మంది బీదా విద్యార్థిని విద్యార్థులకు ఫీజు కట్టి చదువు చెప్పించడం, ఇప్పటికి 199మంది బీదా జంటలకు అన్ని ఖర్చులతో వివాహాలు నిర్వహించడం ఉపేంద్ర చేశారు.

ఇంకా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు 41రోజులు ప్రతి రోజు 2000 స్వాములకు అన్న ప్రసాదం అందిస్తారు. 12సం నుండి సేవ చేయడం అలవాటు చేసుకున్న ఉపేంద్ర 300 మంది దంపతులకు శష్టి పూర్తి ఘనంగా నిర్వహించారు.

గోశాల మరియు అనాధ విద్యార్ధి గృహాము వృద్ధాఆశ్రమం ఆయన నిర్వహిస్తున్నారు. 2020 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం కూడా నిర్వహించారు. ఇప్పటి కి అయన మూడు దేవాలయలు నిర్మించారు. రక్త దాన శిబిరలు, మెగా హెల్త్ క్యాంపులు కూడా ఆయన నిర్వహించారు.

Related posts

సరదాగా ఇంతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

నేటి నుండి ఉచిత బియ్యం పంపిణీ

Satyam NEWS

జ‌ర్న‌లిస్టు సంక్షేమ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌మీక్షించేందుకు క‌మిటీ

Satyam NEWS

Leave a Comment