37.2 C
Hyderabad
May 2, 2024 11: 33 AM
Slider ముఖ్యంశాలు

కరెంట్ ఛార్జీల పెంపుదలపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం

#congress

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తాలూకా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వహీద్, మండల ఉపాధ్యక్షులు కొంకల కురుమూర్తి, రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ముందు పానగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా తాలూకా యువ నాయకులు రంగినేని అభిలాష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిలాష్ రావు మాట్లాడుతూ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నిరసనలు చేస్తూ నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర 350 రూపాయలు ఉండేదని మోడి ప్రభుత్వం అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 1200 రూపాయలు గ్యాస్ ధరలు పెంచడం సిగ్గచేటు అని అన్నారు. పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరల వలన రైతు కు హార్వెస్టర్ కిరాయిలు 2000 నుండి 3500కు పెరిగాయని, రవాణా ఖర్చులు పెరిగి రైతులపై తీవ్ర భారం పడిందని అన్నారు.

ఇంతటి తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నా రైతుల నుంచి వరి కొనను అని మరో గుదిబండ మోపుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో కేసిఆర్ ను గద్దెదించేవరకు నిద్రపోమని రంగినేని అభిలాష్ రావు హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు, రైతులకు రుణమాఫి జరగాలన్నా, విద్యార్థుల కు ఫీజ్ రీయంబర్స్మెంట్ కావాలన్నా, నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలన్నా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆయన అన్నారు.

తాలూకా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు లాలయ్య నాయుడు, మండల ఉపాధ్యక్షులు కొంకల కురుమూర్తి, రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సేవాదల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యండి. ఇర్షాద్ , మండల సేవాదళ్ అధ్యక్షులు బండారు రమేష్ , సేవాదల్ జిల్లా కోఆర్డినేటర్ భాను, మండల ఉపాధ్యక్షులు రాచూరి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి రంజిత్ నాయక్, సీనియర్ నాయకులు భూతగాళ్ళ స్వామి,వివిధ గ్రామాల అధ్యక్షులు రాఘవేంద్ర, వెంకటయ్య, శ్రీనివాసులు, సహదేవ్, నాయకులు అంబటి ప్రవీణ్, అంబటి రవి, రవితేజ, సురేష్, వరుణ్, అరుణ్, శ్రీకృష్ణ, కిసాన్ సెల్ నాయకులు అర్గిటి మన్యం,నాగయ్య, బీరయ్య, నందికొండ వెంకటయ్య, మైనద్దీన్, సాధిక్, గంగన్న,శివ రేమద్దుల, బుసిరెడ్డిపల్లి అశోక్, శివ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ మొట్టే పరమేష్ తెలిపారు.

Related posts

కొర్రకోడులో ఘనంగా బాలల దినోత్సవం

Satyam NEWS

కరోనా సేవలు అందించిన ఖమ్మం పోలీస్ సిబ్బందికి మెమెంటోలు

Satyam NEWS

ఎన్టీఆర్‌కి భార‌త ర‌త్న ఇవ్వాలి: చిరంజీవి

Satyam NEWS

Leave a Comment