39.2 C
Hyderabad
April 30, 2024 22: 25 PM
Slider ముఖ్యంశాలు

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వార్తలు సృష్టిస్తున్న కాంగ్రెస్

#bjp

బీజేపీ తో పొత్తు పెట్టుకోవడ కోసమేమాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీజేపీ ఇమేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రికి ఫ్లైట్ బుకింగ్ నుంచి మొదలు ప్రధాని అపాయింట్ మెంట్ వరకు అబద్ధాలతో వార్తలు అల్లారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బీజేపీ -బీఆర్ఎస్ ఒకటేనంటూ చేసే పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఆయన అన్నారు. బీజేపీ చేపట్టిన విజయసంకల్ప యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామానికి బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. విజయసంకల్ప యాత్ర విజయవంతంగా జరుగుతుండటంతో కాంగ్రెస్ నాయకులు వణికిపోతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ వార్తలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటోంది. తప్పుడు వార్తలతో తెలంగాణలో అధికారం చెలాయించాలనుకుంటున్న కాంగ్రెస్ కు ఎలా బుద్ధిచెప్పాలో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్ తోలుబొమ్మల నాటకం ఆడుతున్నాయని ఆయన అన్నారు.

Related posts

రామారావు మారాజ్ గొప్ప ఆదర్శనీయుడు

Sub Editor

మహారాష్ట్రలో జెండా ఎగరవేసిన బీఆర్ యస్

Bhavani

ఫుడ్ పాయిజనింగ్ పై ఉన్నతస్థాయి విచారణ షురూ

Satyam NEWS

Leave a Comment