రామారావు మహరాజ్ గొప్ప ఆదర్శనీయుడని జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే అన్నారు. ఈ సందర్బంగా బిచ్కుంద మండలకేంద్రంలోని భద్రాలతాండా మహారాజ్ సంస్మరణ మహోత్సవం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే హాజరయ్యి మహరాజ్ కు ప్రత్యేక పూజల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహరాజ్ కు తనకున్నఅభిమానాన్నిప౦చుకున్నారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్నారు. గిరిజనులకే కాకుండా అందరికీ ఆయన ఆదర్శనీయుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గిరిజన నాయకులు బద్యానాయక్, ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ జెడ్పీటీసీ సాయిరామ్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, మండల తెరాస ప్రజాప్రతినిధులు గిరిజన నాయకులు శంకర్, మాణిక్, ఎంపీటీసీ శాంతాబాయి ధన్ సింగ్, గోవింద్ బాబు, వసురామ్, ఉపాధ్యాయులు హీరా జాదవ్, గణపతి, యస్వంత్, హరి, గణపతి పవర్, తండా వాసులు ఉన్నారు.