30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider కడప

కాంగ్రెస్ కు వెనుపోటు పొడిచిన వ్యక్తి వై ఎస్ జగన్

#N.Tulasireddy

కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లాఇందిరా భవన్ లో బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ అసలైన కాంగ్రెస్ వాది అన్నారు. కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదవులు పొందారని తెలిపారు. వైఎస్ బీజేపీకి బద్ధ శత్రువు అన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ దే అన్నారు.

సోనియా గాంధీ కి డాక్టర్ వైఎస్ అంటే ఎనలేని అభిమానం అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వై ఎస్ జగన్ వెన్నుపోటు పొడిచారని తులసిరెడ్డి తెలిపారు.

Related posts

చెమ్మగిల్లని కన్ను !?

Satyam NEWS

ఓటమి అంచున ఊగుతున్న వైసీపీ బడానేతల వారసులు

Satyam NEWS

గ్రహణంపై ప్రజలకు శాస్త్రీయ అవగాహన ఉండాలి

Satyam NEWS

Leave a Comment