కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున డీఎస్పీ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరిఅయిన ధ్రువీకరణ పత్రాలు లేని వంద బైక్ లు ఎనిమిది ఆటోలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా బాన్స్ వాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ తనిఖీలు చేపట్టామని ప్రజలు ఇబ్బందుల పడ్డప్పటికీ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐ టాటా బాబు ఎస్సై సుధాకర్ పోలీస్ బృందం ఉన్నారు.