కడపలోని రిమ్స్ లో ఒక వ్యక్తి కరోనా తో మృతి చెంది గంటలు కావస్తున్నా శవాన్ని తరలించలేదు. దాంతో అక్కడ ఉన్న ఇతర రోగులు తీవ్ర ఆందోళన చెందారు.
సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యంతో వార్డులోకి వచ్చిన రోగి మరణించాడు. ఆసుపత్రికి వచ్చే సమయానికే చనిపోయినట్లు వైద్యులు అంటున్నారు.
అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆ మృతదేహాన్ని చాలా సేపటి వరకూ అక్కడ నుంచి తరలించలేదు. రోగి చనిపోయిన తర్వాత కనీసం బెడ్ ను కానీ, వార్డును కానీ శానిటైజేషన్ కూడా రిమ్స్ సిబ్బంది చేయలేదు.
అదే బెడ్ పై ఎటువంటి శానిటేషన్ లేకుండా మరో రోగిని సిబ్బంది చేర్చారు.