37.2 C
Hyderabad
May 6, 2024 19: 52 PM
Slider కడప

ఛా ఛా ఇదేం కోవిడ్ కేర్ సెంటర్?

#KadapaRIMS

కడపలోని రిమ్స్ లో ఒక వ్యక్తి కరోనా తో మృతి చెంది గంటలు కావస్తున్నా శవాన్ని తరలించలేదు. దాంతో అక్కడ ఉన్న ఇతర రోగులు తీవ్ర ఆందోళన చెందారు.

సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యంతో వార్డులోకి వచ్చిన రోగి మరణించాడు. ఆసుపత్రికి వచ్చే సమయానికే చనిపోయినట్లు వైద్యులు అంటున్నారు.

అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆ మృతదేహాన్ని చాలా సేపటి వరకూ అక్కడ నుంచి తరలించలేదు. రోగి చనిపోయిన తర్వాత కనీసం బెడ్ ను కానీ,  వార్డును కానీ శానిటైజేషన్ కూడా రిమ్స్ సిబ్బంది చేయలేదు.

అదే బెడ్ పై ఎటువంటి శానిటేషన్ లేకుండా మరో రోగిని సిబ్బంది చేర్చారు.

Related posts

ప్రీతి మృతికి నిరసనగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

మరో వూహాన్ లా మారిన తూర్పుగోదావరి జిల్లా

Satyam NEWS

కాశ్మీర్ స్కూళ్లలో రఘుపతి రాఘవ పాట పాడిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment