కరోనా లాక్ డౌన్ కారణంగా బ్రాహ్మణార్ధానికి దూరమైన భోక్త బ్రాహ్మణులకు శంకర భారతి ట్రస్ట్ నిత్యావసరాలు అందచేసింది. మేడ్చల్ నియోజకవర్గం లోని 35 మంది భోక్త బ్రాహ్మణులకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున ఈ ఏర్పాటు చేశారు.
మొత్తం రూ.50 వేల విలువైన నిత్యావసర వస్తువులను ఒక కిట్ గా చేసి భోక్త బ్రాహ్మణులకు అందచేశారు. ఒక్కొక్కరికి 25Kgs బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ మినపప్పు, 1లీటర్ ఆయిల్, 5Kgs కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు అందచేశారు. లాక్ డౌన్ కారణంగా బ్రాహ్మణులకు ఉపాధి కరవైంది.
ఎక్కడకూ వెళ్లలేక వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి దగ్గరే ఉండి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సంగతి గ్రహించి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆసరా పథకం కింద ఇప్పటికే చాలా మందికి వెయ్యి రూపాయలు అందించింది.
అలాగే భోక్త బ్రాహ్మణులును కూడా ఆదుకోవాలనే తలంపుతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని జరిపించామని మేడ్చల్ నియోజక వర్గం బ్రాహ్మణ సేవా సంఘ గౌరవ అధ్యక్షులు రెండుచింతల రామ చంద్ర మూర్తి తెలిపారు.