కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని బాన్స్వాడలో హోం క్వారంటైన్ కు తరలించినట్లు ఆరోగ్య బోధకులు దస్థిరం తెలిపారు. ఒకే కుటుంబం వారు కావడంతో సరియైన వసతులు హోం ఐసోలేషన్ లో లేకపోవడం వలన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారికి బాన్స్వాడ తరలించినట్లు ఆయన వివరించారు.
ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య అధికారుల సలహాల మేరకు మందులు తీసుకుంటే త్వరలోనే వారు కోలుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైద్యులు డాక్టర్ విక్రమ్,మండల ఆశా కార్యకర్తలు రెవెన్యూ అధికారులు శ్రీహర్ష, పండరి ఉన్నారు.