గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన మల్లెల శ్రీనివాసరావు (సారాయి శ్రీను) కి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. అందువల్ల శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అతను పని చేస్తున్న రామిరెడ్డి పేటని రెడ్ జోన్ గా ప్రకటించారు.
రెండు ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారని స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక నుండి రెడ్ జోన్ ప్రాంతంలో ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీలులేదని ఆయన తెలిపారు.
ప్రత్యేక వైద్య బృందాలతో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తామని, ప్రజలు కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, అధికారులు ఇకమీదట మరింత కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.