తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యామని, రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మత్స్య సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తు ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ కు హుజురాబాద్లో మద్దతు లేఖ అందజేశారు మత్స్య సంఘం నేతలు.
సంఘానికి సంక్షేమ భవనంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందుతున్నారని, చేపపిల్లల పంపకాలతో పాటు, వలలు, ఆధునిక మర బోట్లు ఇతర సామాగ్రిని అందించి ఆర్థికంగా, సామాజికంగా మత్స్యకారులు ఎదగడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ వెంటే ఉంటామని ,హుజురాబాద్ ప్రాంతంలోని సంఘ సభ్యులందరూ తీర్మానం చేసిన కాపీని మంత్రి గంగుల కమలాకర్ కు అందజేశారు. మత్స్యకారుల తోపాటు తమ సంఘానికి సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యుల మద్దతు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గట్టు పద్దయ్య సంఘానికి చెందిన బిక్షపతి, కొమురయ్య, చిన్న రాజయ్య, రామయ్య భద్రయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.