హైదరాబాద్ శివారులోని పఠాన్ చెరు నియోజక వర్గంలోని అమీన్ పూర్ సాయి కృప కాలనీ లైఫ్ లైన్ స్కూల్ సమీపం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు ఆ ప్రాంతానికి వెళ్లారు.
పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, శాసన సభ్యుడు మహిపాల్ రెడ్డి తో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలపై సమీక్ష నిర్వహించారు. అమీన్ పూర్ లోని ఎస్వీఆర్ గార్డెన్, కందిలోని ఎస్.ఎస్ గార్డెన్ లలో ఆటోడ్రైవర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సరుకుల పంపిణీ చేశారు.