ఒకే చోట ముగ్గురు యువతుల మృతదేహాలు కనిపించడం హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో చెట్టుకు వేలాడుతూ రెండు మృత దేహాలు కనిపించగా మరో పాప మృతదేహం నేలపై అక్కడికి కొద్ది దూరంలో పడి ఉంది.
డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలు ముందుగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు చెట్టు పక్కనే మరో చిన్నారి మృతదేహం కనిపించింది. ఒకే చోట మూడు మృతదేహాలు ఉండటంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ లభించలేదు.