కరోనా ను చూసి భయపడుతున్నవారికి శుభవార్త. అనుకున్న సమయానికన్నా ముందే కరోనా వ్యాక్సిన్ రాబోతున్నది.
అదీ కూడా మన దేశంలో మనం తయారు చేసుకుంటున్న వ్యాక్సిన్. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసీఎంఆర్) తో కలిసి ప్రయివేటు కంపెనీ అయిన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ పై పని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జూన్ తర్వాత వస్తుందని ముందుగా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్ రడీ అవుతున్నదట.
ఈ కోవాక్సిన్ ఎంతో సురక్షితమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ఎంతో సమర్ధంగా పని చేస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫిబ్రవరిలో వచ్చే ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను నిరోధించడంలో సఫలం అయిందని కూడా వారు వెల్లడిస్తున్నారు. అందువల్ల మనం వచ్చే ఫిబ్రవరి వరకూ జాగ్రత్తగా ఉండాలి.
మాస్క్ వాడుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.