తెలుగువారిని పూనీతులను చేసిన ధన్యజీవి
ఆర్థికసంస్కరణలకు దారిచూపిన మేథావి
వారే వంగరలో జనియించిన మన పి.వి
నిరంతరవిద్యార్థినంటు ఓదిగుండే మౌనముని
దూరదృష్టి తో అంకుఠితదీక్షతో
కష్టంలో ఉన్న ఆర్థిక రథాన్ని విజయతీరాలకు చేర్చిన శ్రీకృష్ణుడు
సంకీర్ణంలో సడలని రాజకీయచాణక్యుడు
జాతీయ..తెలంగాణ.. వందేమాతర ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన వెంకటనరసింహుడు
భూసంస్కరణల..ఆర్థిక సంస్కరణలయజ్ఞంచేసిన
బహుభాషా కోవిదుడు…బ్రాహ్మణోత్తముడు మన పి.విగారు
మనందరం మరిచిపోని ఠీవి వారు
మంత్రిగా..ఎదిగి..ప్రధానమంత్రి గా అత్యుత్తమ పీఠాన్ని
అందుకున్న తెలుగువాడు..తెగువగలవాడు…తెలీవిగలవాడు
నిబద్ధతనే సిద్ధాంతంగా పాటించే ఆలోచనల తొణగని నిండుకుండవారు…
కట్టుబొట్టుపంచెకట్టుతో నిలిచిన తెలుగుతలకట్టువారు
సంకీర్ణంలో ప్రపంచికరణంలో…ప్రతిభకే పట్టంకట్టిన
దానగుణశీలవంతుడు..ముక్కుసూటి మనిషి….
పేదరికపు చీకటిని తరిమి విద్యానవోదయాన్ని
అందించిన..చిరస్మరణీయుడు..జాతికి…దేశానికి…
దశదిశ నిర్దేశం చేసిన…నిస్వార్థ…మన పి.వి గారు..
తెలుగువాడు గర్వపడేలా…తెలంగాణవాళ్ళు…పొంగిపోయేలా…
చేసిన…మనందరి లోపలిమనిషి…ఆలోచనలరుషి
మన పి.వి గారు..మనందరి పి.వి గారు
రామగిరినరేష్, ధర్మపురి, ఫోన్-8639361294