లైంగికదాడుల కేసుల్లో దేశ వ్యాప్తం గా న్యాయస్థానాలు సత్వరమే స్పందిస్తున్నాయి.నిందితులకు కఠినంగా శిక్షలు వేస్తున్నాయి.దీనితో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి కనువిప్పు కానుంది.తాజాగా 27 ఏళ్ల మహిళను లైంగికదాడి చేసిన కేసులో నలుగురు నిందితులకు తమిళనాడు రాష్ర్టం లోని తాంజావూర్ మహిళా కోర్టు జీవితకాల శిక్షను విధించింది బాధితుల పక్షాన నిలబడింది.
2018 డిసెంబర్ 1 వతేదీన ఉద్యోగంలో భాగంగా బ్యాంకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళపై నలుగురు లైంగికదాడి చేశారు. రైల్వే స్టేషన్లో దిగిన మహిళను ఇద్దరు ఆటోరిక్షాలో తీసుకువెల్లి అఘాయిత్యానికి పాల్పడగా ,ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చి ఆమెపై లైంగికదాడి చేశారు.కుంభకోణంలో జరిగిన ఈ లైంగికదాడి లో నిందితులైన ఎస్.పురుషోత్తం, ఎస్.అన్బరసన్, ఎస్.దినేశ్, వసంత్లకు కోర్టు శిక్షను ఖరారు చేసింది.