ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైకాపా నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన కోర్టు.. మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
previous post
next post