అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిందని అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం అని డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు.
ఆదివారం అంబర్పేట్ డివిజన్ రెడ్ బిల్డింగ్ చౌరస్తా లో ఈ – శ్రమ్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ – శ్రమ్ కార్డులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించిన క్యాంపులు నిర్వహిస్తామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, మిర్యాల శ్రీనివాస్, నాగరాజు చారి, బాలకృష్ణ గౌడ్, ప్రవీణ్ కుమార్, దుర్గాప్రసాద్, ముఖేష్ గౌడ్, శివ మూర్తి, శివ కుమార్ గుప్తా, శాతం శశికాంత్, జెన్ సాహస్ సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట