విజయనగరం రూరల్ ఎస్ నసీం బేగంపై ప్రశంసల జల్లు….!
కర్తవ్య దీక్షలో ఆమె దిట్ట..విధుల నిర్వహణలో అస్సలు తగ్గదు. “పుష్ప” సినిమాలో హీరో అన్నట్టు తగ్గేదేలే అంటూ దూసుకెళుతున్నారు…ఏపీలోని విజయనగరం రూరల్ పీఎస్ లో పని చేస్తున్న ఎస్ఐ నసమా బేగం. సరిగ్గా రెండేళ్ల క్రితం..అంటే 2020లో పోలీస్ శాఖ లో జాయన్అయిన ట్రైనీ ఎస్ఐగా జామిలో తొలి పోస్టింగ్. అనంతరం…ఉన్నతాధికారుల ఆదేశాలు…ఎస్ఐ విజ్ఙప్తి మేరకు…విజయనగరం రూరల్ స్టేషన్ కు ఎస్ఐ గా పదవీ బాద్యతలు చేపట్టారు.
అప్పటి నుంచీ తన సర్కిల్ ఇన్ స్పెక్టర్ సత్యమంగవేణి ఆదేశాలు,,,డీఎస్పీ సూచనలతో పోలీస్ యూనిఫాం వేసుకుంటే చాలు…ఇక తన,పర అన్నబేధం చూడకుండా ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తారు. ఇటీవలే జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా ఆ పై కలెక్టరేట్ ముట్టడిలో…తానేంటో…తన ప్రతాపం..అలాగే తన విధేంటో..అటు నిరసన కారులకు ఇటు పోలీసు ఉన్నదాధికారులకు ఎస్ఐ నసీం చూపించారు.
వంటిపై మూడు సింహాలతో ఉన్న టోపీ ఎగిరి పక్కకు పడ్డా…చేతిలో లాఠీ లేకుండానైనా…కలెక్టరేట్ గేట్ లోకి ఏ ఒక్కరినీ లోపలకు వెళ్లేందుకు అడ్డంగా నిలవడమే కాక..మూకమ్ముడిగా వచ్చిన నిరసన కారులు అందరినీ…ఠళాయించి..ఆమడదూరంలో నెట్టేసిన ఎస్ఐ నసీం.తాజాగా…నగరంలోని ఒంటి తాడి అగ్రహరంలో పదమూడేళ్ల కొకసారి జరిగిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సందర్బంగా విశాఖ నుంచీ సాలూరువైపు వెళ్లే 45 వ జాతీయ రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ లేకుండా…చర్యలు చేపట్టి శబాష్ అనిపించుకున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఎస్ఐ నసీం చేసిన పనితీరుకునెటజన్లు ఫిదా అయిపోవడమే కాక…ఇలాంటి ఎస్ఐలు ..ప్రతీ చోట ఉంటే చాలు అన్నట్టు కామెంట్ లుపోస్ట్ చేయడం విశేషం…హేట్సాప్ చెబుతోంది…సత్యం న్యూస్.నెట్.
ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం