హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఒలింపిక్ డే సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోలకు సవాల్ విసిరారు. వ్యాయామం చేసిన వీడియోను తనకు పంపాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైన గానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారీరక వ్యాయామం లేకుండా ఉండటం చూస్తుంటే కలవరపెడుతుంది.
అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు అంకితమవుతున్నారు. అవి వారిని కట్టిపడేశాయి. దీంతో వారు అస్సలు కదలరు’’ అని రాసుకొచ్చి హీరో నిఖిల్, అడివి శేష్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధులను ట్యాగ్ చేశారు.
దీంతో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వర్కౌట్ వీడియోను పోస్ట్ చేశారు. అది చూసిన సీపీ ఆనంద్ ఛాలెంజ్ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అంటూ అడివి శేష్ సినిమాల్లో స్మార్ట్ లుక్తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతేకాదు కష్టం కూడా’’ అని అన్నారు.