39.2 C
Hyderabad
May 4, 2024 21: 33 PM
Slider విజయనగరం

మోడీ,జ‌గ‌న్ ప్ర‌భుత్వాల‌పై సీపీఎం క‌న్నెర్ర‌

#CPM Vijayanagaram

అటు కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వంపైన ఇటు ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన‌ సీపీఎం గుర్రుగా ఉంటోంది. కేంద్ర‌,రాష్ట్ర ప్రభుత్వాలు అనుస‌రిస్తున్న, అవ‌లంబిస్తున్న‌ విధానాల‌పై సీపీఎం రాష్ట్ర పార్టీ విమ‌ర్శ‌లు తో పాటు ఆందోళ‌న‌లూ చేప‌డుతోంది.

ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం …జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌లో ఆస్తి ప‌న్నుపెంచ‌డంతో సీపీఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు  విజ‌య‌న‌గ‌రం జిల్లా సీపీఎం  పార్టీ ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేర‌కు జిల్లా కేంద్రంలోని క‌లెక్ట‌రే్ట్ వ‌ద్ద సీపీఎం నేత‌లు రెడ్డి శంక‌ర‌రావు బృందం ద‌ర్నా చేప‌ట్టింది.

పెంచిన ఆస్తి ప‌న్ను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేసింది.ఈ సంద‌ర్బంగా సీపీఎం నేత‌లు మాట్లాడుతూ…స్థానిక మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై విమ‌ర్శ‌లు చేసారు.

దాదాపు అర‌గంట‌సేపు కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై సీపీఎం దుమ్మెత్తి పోసింది. అనంత‌రం…క‌లెక్ట‌ర్ వ‌ద్ద ప‌ది నిమిషాలు ర్యాలీ నిర్వ‌హించారు.

Related posts

నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS

రేపటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఓపెన్

Satyam NEWS

మండల ఆర్.ఎమ్.పి(రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సంఘం సమావేశం

Satyam NEWS

Leave a Comment