39.2 C
Hyderabad
May 3, 2024 11: 22 AM
Slider ప్రత్యేకం

8వ విడత హరిత హారం కు ఏర్పాటు చేసుకోవాలి

#chiefsecretary

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 8వ విడత హరిత హారం కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో సిద్దం కావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం ఉదయం ఉదయం జిలా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలంగాణకు హరితహారం, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్బంగా హరితహారం పై ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారం జులై కంటే ముందే ప్రారంభించి ఆగస్టు మాసం చివరికల్లా పూర్తి అయ్యే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటేవిధంగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, కెనాల్ వెంబడి విస్తృతంగా మొక్కలు నాటేవిధంగా చూడాలన్నారు.  పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు గ్రౌండింగ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.    మే, 7వ తేదీలోగా హరితహారం జిల్లా ప్రాణాళిక సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. 

దళితబంధు పథకం పై సమీక్షిస్తూ నియోజకవర్గాల వారిగా మంజూరు అయిన వాటితోపాటు ప్రత్యేక మండలాలను ఎంపిక చేసిన దళితబంధు యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. 

వానాకాలం పంట సాగు ప్రాణాళిక పై మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేసేవిధంగా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు.  పెసర్లు వేయడం వల్ల దిగుబడితో పాటు భూమి సారవంతమైతదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  కంది పంట సాగు పెంచాలని రైతులు ఎరువులు మోతాదుకు మించి వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. 

వరి పంట డైరెక్ట్ సీడ్స్ వేసే విధానం పై అవగాహన కల్పించాలని సూచించారు.  వ్యవసాయ విస్తీర్ణాధికారులు తమ రైతు వేదికలో ఉండి విధులు నిర్వహించేవిధంగా అదేశించి రైతువేదికలను వందశాతం ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్లను సూచించారు. 

వచ్చిన ధాన్యం వచ్చినట్టుగా కొనేయాలి

వరి కొనుగోలు పై సమీక్ష నిర్వహిస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచాలని వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  ధాన్యం కొనుగోలు వివరాలు అదేరోజు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.  కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నాటిన హరితహారం మొక్కలు 96 శాతం జీవించి ఉన్నాయన్నారు.  8వ విడత హరితహారం లో 47 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేసి స్థలాన్ని గుర్తించి పెట్టుకున్నామన్నారు.

కొత్తగా 98 నర్సరీలు ఏర్పాటు చేయగా 82 శాతం విత్తనాలు మొలకెత్తినట్లు తెలిపారు.  వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో వరి కోతలు ఆలస్యం కావడం చేత అనుకున్నంత సేకరణ జరగలేదని త్వరలోనే వేగవంతమవుతుందన్నారు.  దళితబంధు ఇప్పటి వరకు 113 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, మిగతా వాటికి పాక్షికంగా డబ్బులు జమచేశామని తెలిపారు. త్వరలోనే వందశాతం గ్రౌండింగ్ పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ అధికారి గోబ్రియాల్, శాంతకుమారి,  ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణా రావు, నాగర్ కర్నూల్  జిల్లా నుండి కలెక్టర్ ఉదయ్ కుమార్, ఆదనవు కలెక్టర్ లోకల్ బాడీ మను చౌదరి, రెవెన్యూ రాశేష్ కుమార్, డి.ఎఫ్.ఓ కిష్టా గౌడ్, పి.డి డి.ఆర్.డి.ఓ నర్సింగ్ రావు, ఇంజనీరింగ్ అధికారులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

వెల్ డన్: లాక్ డౌన్ అమలులో తెలంగాణ పోలీస్ భేష్

Satyam NEWS

అవగాహన లేని జగన్: అమాంతం పెరిగిన కరెంటు చార్జీలు

Satyam NEWS

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment