28.7 C
Hyderabad
April 27, 2024 03: 34 AM
Slider తెలంగాణ

వెల్ డన్: లాక్ డౌన్ అమలులో తెలంగాణ పోలీస్ భేష్

Telangana DGP

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణలో భాగంగా రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను  అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి డీజీపీ  పి. మహేందర్ రెడ్డి  అభినందనలు తెలిపారు.

లాక్ డౌన్  అమలు నేపథ్యంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, లాక్ డౌన్ మరింత సమర్థవంతంగా అమలు, విధినిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు శాఖాపరంగా చేపట్టిన సదుపాయాలు  తదితర అంశాలపై నేడు సాయంత్రం డీజీపీ స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్ వరకు దాదాపు మూడు వేల మంది పోలీస్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం కరొనా వైరస్ వ్యాప్తి  నివారణ కై పోలీస్ అధికారులు నిర్విరామకృషి చేస్తున్నారని అన్నారు.  లాక్ డౌన్ అమలు లో పోలీసు అధికారులు మానవీయ కోణంలో విధులు  నిర్వహిస్తుండడం అభినందనీయమని, అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి అని అన్నారు. 

విధి నిర్వహణలో వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, భద్రత అత్యంత ప్రధానమని డీజీపీ పేర్కొంటూ,   విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులందరికీ వైరస్ నిరోధక  పరికరాలన్నీ సమకూర్చనునట్లు ప్రకటించారు. 

లాక్ డౌన్ విధినిర్వహణలో ఉన్న హోంగార్డు  అధికారి నుండి  అన్ని స్థాయిల పోలీస్ అధికారుల  ఆరోగ్య,  సంక్షేమాన్ని చూసే  బాధ్యత  పోలీస్ కమిషనర్లు,  ఎస్పీ లపై ఉందని స్పష్టం చేశారు. కరోనా నివారణ కై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశాఖ అందించే మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి పాటించాలని అన్నారు.

ముఖ్యంగా క్వారంటైన్ కేంద్రాలు, కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందించే ఆసుపత్రుల  వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు  మరింత వ్యక్తిగత ఆరోగ్య రక్షణ చర్యలను చేపట్టాలని చేపట్టాలని,  లాక్ డౌన్ విధులలో ఉన్నవారందరూ మాస్కులు ధరించడం, సానీటైసర్లను తప్పనిసరిగా వాడాలని డీజీపీ తెలిపారు. 

అత్యంత  ప్రమాదకరమైన ఈ వైరస్ కు చికిత్స లేదని,   కేవలం నివారనె  మార్గమని అంటూ,  ఈవ్యాధి  నివారణకు  తెలంగాణ రాష్ట్రంలో  అమలవుతున్న లాక్ డౌన్  తీరుపై  దేశవ్యాప్త ప్రశంసలు లభిస్తున్నాయని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

లాక్ డౌన్ ను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ శాఖ  పని తీరుపై ప్రభుత్వం కూడా అభినందిస్తోందని.,  లాక్ డౌన్ అనంతరం పోలీస్ శాఖకు తాగు ప్రోత్సాహకాలు ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు.  మానవీయ కోణంలో,  సమాజ భద్రత,   రాష్ట్ర పురోభివృద్ధి కై  నిర్విరామ కృషి చేస్తూ పోలీస్ శాఖకు తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరును తెస్తున్న పోలీస్ అధికారులందరికీ డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గోపన్ పల్లి బిడ్డ దక్షిణ కొరియాలో ఉన్నత శిఖరాలకు…

Satyam NEWS

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

Satyam NEWS

Leave a Comment