39.2 C
Hyderabad
April 30, 2024 19: 53 PM
Slider వరంగల్

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

medaram 03

మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వనప్రవేశంతో ముగియనుంది. ఈ క్రమంలో మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ ఇవాళ ఉదయం పరిశీలించారు.

మహా జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్నానఘట్టాలను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

వర్షాలతో ప్రజలు చనిపోతుంటే కెసిఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటరు

Bhavani

కెటిఆర్ వ్యాఖ్యలకు బాలకోటయ్య కౌంటర్

Satyam NEWS

జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

Satyam NEWS

Leave a Comment