మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వనప్రవేశంతో ముగియనుంది. ఈ క్రమంలో మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఇవాళ ఉదయం పరిశీలించారు.
మహా జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్నానఘట్టాలను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.