కులవృత్తులతో జీవనం సాగిస్తున్న దళిత సామాజిక వర్గానికి ఐదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చెప్పులు కుట్టుకునే, డప్పులు కొట్టుకునే, వారి వారి కుల వృత్తుల ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న వారికి ఐదు వేల రూపాయల నెలవారి పెన్షన్ మంజూరు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా మండల తహసీల్దార్ రామ్ రెడ్డి కి సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన హామీ మేరకు దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ దుర్గాప్రసాద్ నరసింహ రవి గౌడ్ యాదవ్ అంజన్ రెడ్డి హరీష్ గౌడ్ శ్రీశైలం బలం గౌడ్ రామస్వామి శ్రీనివాసాచారి మండల అధ్యక్షులు శ్రీశైలం ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.