38.2 C
Hyderabad
April 29, 2024 20: 46 PM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ డి సి సి బి చైర్మన్ గా దళిత నేత

nirmal dccb

ఆదిలాబాద్ జిల్లా డి.సి.సి.బి చైర్మెన్ పదవిని తొలి సారిగా ఒక దళిత నేతను వరించింది. నార్నూర్ మండలం గుంజాల వాసి అయిన కాంబ్లే నాందేవ్ సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా డి సి సి బి పదవి ఇప్పటి వరకూ దళితులకు దక్కలేదు. కాంబ్లే  నాందేవ్ ను ఎంపిక చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఘనత దక్కేలా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషకర విషయమని, తాను ఎంతో రుణ పడి ఉంటానని ఆయన అన్నారు . వైస్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యావాదాలు తెలుపుతున్నట్లు నాందే వ్ మీడియా తో చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నడి పెళ్లి దివాకర రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న తదితరులు హాజరయ్యారు.

Related posts

యాక్షన్ కింగ్ అర్జున్ -క్రికెట్ కింగ్ హర్భజన్ ఫ్రెండ్ షిప్ టీజర్ విడుదల

Satyam NEWS

హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం

Satyam NEWS

రోల్ మోడల్ పాత్ర పోషిస్తున్న హోంగార్డులు

Murali Krishna

Leave a Comment