35.2 C
Hyderabad
May 1, 2024 00: 00 AM
Slider ప్రత్యేకం

భూ కబ్జా పై తిరగబడ్డ దళిత బాధితులు…

#Land

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయ్య పల్లె దళిత వాడలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.1979 లో కాంగ్రెస్ హయాంలో దళితులకు ఇచ్చిన ఇంటి పట్టా స్థలాలను చెంగల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా జె.సి.బి తో చదును చేయడంతో చెంగల్ రెడ్డి ని బాధిత దళితులు నిలదీసి,యెదురు తిరిగి అడ్డుకున్నారు.ప్రభుత్వం ఇచ్చిన పంట భూముల్లో,పట్టా స్థలాల్లో కాసుల గుట్ట ఆలయంకు దళితులు దారి కోసం స్థలం ఇచ్చినారు.

చెంగల్ రెడ్డి ఆ దారితో పాటూ తమ ఇంటి పట్టాలను అక్రమించ ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.చెంగల్ రెడ్డి కబ్జాల నుంచి కాపాడి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి ని సర్దుమనిచారు.చెంగల్ రెడ్డి పై నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Related posts

ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం పోలీసు బాస్..

Satyam NEWS

పౌర సదుపాయాలను ధ్వంసం చేస్తున్న రష్యా

Satyam NEWS

సపోర్టు: శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment