నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరూ ఊహించని అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఒక గర్భిణికి డెలివరీ సమయంలో డ్యూటీ డాక్టర్ చేయరాని ఘోరమైన తప్పు చేసింది. శిశువును బయటకు తీసే సమయంలో గర్భవతి పేగును కత్తిరించడానికి బదులు గా శిశువు తలను కత్తిరించింది.
అయితే ఈ విషయం ఎవరూ బయటకు చెప్పలేదు ఎవరికి తెలియదు. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి (20) డెలివరీ నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. డ్యూటీ డాక్టర్ సంధ్యా రాణి కొద్దిసేపు డెలివరీ కి ప్రయత్నించి తల్లి గర్భంలో పిండం చనిపోయిందని వెంటనే హైదరాబాద్ తీసు పోమ్మని చెప్పారు.
దాంతో స్వాతిని బంధువులు హైదరాబాద్ లో చార్మినార్ వద్ద ఉన్న జజ్జి ఖానా హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ వారు నిన్న మధ్యాహ్నం డెలివరీ చేసి తల లేని పాపను బయటికి తీశారు. అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోయి స్వాతి ని ఇక్కడకు తీసుకు రాకముందు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని ప్రశ్నించారు.
వారు వివరాలు చెప్పారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దాంతో స్వాతి డెలివరీలో నిర్లక్ష్యం వహించి తమ పాప చావుకు కారణమైన డాక్టర్లపై చర్య తీసుకోవాలని వారు ఆందోళన చేస్తున్నారు.