18వ దత్త జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో షిర్డీ సాయిబాబా మందిరంలో ప్రాతఃకాల సమయంలో ప్రధాన అర్చకులు హనుమ కుమార్ శాస్త్రి,రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో షిరిడి సాయి బాబా వారికి పంచసూక్త విధంగా పంచామృతాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహించి,బాబా వారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి,విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం షిరిడి సాయిబాబా ఉత్సవ విగ్రహాన్ని అశ్వ వాహనంపై అత్యంత సుందరంగా అలంకరించి భక్తులందరి జయజయ ధ్వానాల నడుమ ఊరేగింపుగా నగర పురవీధుల గుండా అత్యంత శోభాయమానంగా మేళతాళాలతో,కోలాట బృందం,భజన బృందాలతో సాయిబాబా వారిని ఊరేగింపుగా బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో షిర్డీ సాయి సమాజం సెక్రెటరీ ఓరుగంటి నాగేశ్వరరావు,కోశాధికారి శేఖర్, జాయింట్ సెక్రెటరీ ఆకుల రాము, సాయి సమాజం గౌరవ అధ్యక్షులు గజ్జి ప్రభాకర్,కుక్కడపు రామ్మోహన్ రావు, కొత్త శ్రీనివాసరావు,పోలిశెట్టి నరసింహారవు,జూలకంటి సత్యం, కామిశెట్టి శ్రీనివాస్,గోపయ్య,సప్పిడి బిక్షం,రమణ,దూళిపాళ్ల రామకృష్ణ, నోముల సీతారామయ్య,ప్రతాపరెడ్డి, సత్యం,నాగేశ్వరరావు,మహిళా భక్తులు వంకాయల పద్మావతి,సుజాత, రాజ్యలక్ష్మి,విజయలక్ష్మీ,హైమా,రాణి, నాగమణి,పెద్ది పుష్ప,అర్పిత,నాగలక్ష్మి, అత్యధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్