కరోనా పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దుతుగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు లక్ష రూపాయల చెక్ ను అందచేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నివారణకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
ప్రజలు కచ్చితంగా లాక్ డౌన్ ను పాటించి ఇళ్లకు పరిమితం కావాలని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాస్కులు ధరించాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
ఆయన వెంట సర్పంచ్ రత్నం పుష్ప నర్సింహ, గ్రామ శాఖ అధ్యక్షుడు మారగోని శివశంకర్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శేఖర్, మండల కో అప్షన్ సభ్యులు మోసిన్, కోయగుర నర్సింహ, చేరుకుపల్లి మహేశ్వర్, చెరుకు మధు,బొడిగే బాలరాజు తదితరులు ఉన్నారు.