Slider కడప

మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దొరికిన శవం

#Erraguntla Murder

మూడు రోజుల కిందట కిడ్నాప్ అయిన వ్యక్తి శవం మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దొరికింది. దాంతో కడప జిల్లా లోని ఎర్రగుంట్ల పట్టణంలో పెను సంచలనం కలిగింది. ఇండియా సిమెంట్ కర్మాగారంలో రిటైర్డ్ ఉద్యోగి అయిన వెంకట రమణ మూడు రోజుల కిందట కిడ్నాప్ కు గురయ్యాడు.

అప్పటి నుంచి అతని కోసం వెతుకుతున్నారు. అయితే ఎక్కడా ఆచూకీ దొరకలేదు. తీరా చూస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంటిలో అతడి మృతదేహం నేడు లభ్యం అయింది. ముసలయ్య, వెంకట రమణ లకు మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఇటీవల ఇద్దరి మద్య వివాదం తలెత్తింది. దాంతో మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముసలయ్య ఉన్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పి సూర్యనారాయణ పరిశీలించారు.

Related posts

సెప్టెంబర్ 16వరకు ఇంటర్‌ ప్రవేశాల గడువు

Bhavani

ప్రధాని విశాఖ పర్యటనలో బిజీ బిజీ

Bhavani

మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి: రైతుల్ని ఆదుకున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment