రిజర్వాయర్ లో దూకి బాలిక మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బుట్టాయగూడెం మండలం రాచురు గ్రామానికి చెందిన మడకం అఖిలప్రియ (19) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అది ఇదే క్రమంలో గత రాత్రి తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఎంత సేపు అయినా బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో అఖిల ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని విచారించారు. అమ్మాయి సమీపంలో ఉన్న పోగొండ రిజర్వాయర్ వైపు వెళ్ళింది అని తెలపడం తో తల్లిదడ్రులిద్దరూ కలసి రిజర్వాయరు సమీపంలో గాలించారు. చీకటి సమయంలో రిజర్వాయర్ చుట్టుపక్కల గాలించగా కూతురు ఆచూకీ లభించకపోవడం స్థానిక నాయకుల సహకారంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
గజ ఈతగాళ్లు కలిసి తెల్లవారుజాము నుండి రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి బంధువులు మాట్లాడుతూ బాలిక చాలా చురుగ్గా ఉంటుందని చదువులో కూడా ఎప్పుడూ ముందుంటుందని కానీ ఇలా జరగడం చాలా విచారకరమని తెలిపారు. స్థానిక నాయకులు ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్లేవారని తమ కుమారుని, కూతురుని ఉన్నత స్థాయి చదువులు చదివించాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు బాగా కష్ట పడుతున్నారు. అయితే తమ కూతురు మృతి చెందడం మా కుటుంబానికి తీరని లోటని తల్లిదండ్రులు వాపోయారు.