తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నేడు హైదరాబాద్ లోని ట్యాంకుబండ్ మీద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ మౌన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసని వీరేశం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి ఏ రోజు కూడా ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.
తను నిస్వార్థంగా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ని కేవలం రాజకీయా కక్ష తో తప్పుడు కేసులతో ఆయన్ను జైలు కు పంపడం చాలా అన్యాయం అని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.