33.7 C
Hyderabad
February 13, 2025 21: 22 PM
Slider రంగారెడ్డి

వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

Sailesh

ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్ధి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిని అవుశపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. చెలాకీగా ఉండే శైలేష్ ఇలా అర్ధంతరంగా తనువు చాలించాడనే వార్త విని అందరూ షాక్ అవుతున్నారు.

అవుశపూర్ గ్రామానికి చెందిన శైలేష్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ విషాద వార్త తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం…కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు

Satyam NEWS

రాధికమర్డర్:హత్య స్థలాన్ని పరిశీలించిన కమీషనర్

Satyam NEWS

Leave a Comment