40.2 C
Hyderabad
April 28, 2024 18: 36 PM
Slider ముఖ్యంశాలు

సీఎం జగన్‍పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

#CMJagan

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను కించపరిచేలా లేఖ రాయడం తప్పని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమేనని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ లేఖ ఉందని, రాజ్యాంగ వ్యవస్థలపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడి చేయడం దురదృష్టకరమని వారన్నారు.

న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకునే ప్రయత్నాలను సీఎం జగన్ మానుకోవాలని వారు కోరారు. జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారని, అత్యుత్తమ నిబద్ధత కల న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని వారు అభిప్రాయపడ్డారు.

Related posts

కరోనాను కట్టడిచేసేందుకు వ్యాపారస్తులు సహకరించాలి

Satyam NEWS

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన జగన్ ప్రభుత్వం…..

Satyam NEWS

19 న యూసీసీ మద్దతు ర్యాలీ: కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Satyam NEWS

Leave a Comment