జుక్కల్ మండలం మమదాబాద్ గ్రామానికి చెందిన కవిత వయసు 25 సంవత్సరాలు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది కవితను బిచ్కుందలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు వచ్చాయి.
పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలోనే నార్మల్ డెలివరీ అయ్యిందని ఆడ పాప జన్మించిందని 108 సిబ్బంది ఈ ఎమ్ టి సుభాష్ తెలిపారు. తల్లి పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నారని తదుపరి చికిత్సల నిమిత్తం బాన్స్ వాడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు.