భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయని అన్నారు.స్వాతంత్ర్య పోరాటం చేసిన ఎంతోమంది మహానీయుల త్యాగాలతో నిండిన భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారిందని అన్నారు.దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి జీవిస్తున్నారని,మహాత్మా గాంధీ,జవహర్ లాల్ నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహోన్నతులు ఈ దేశం కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు.
భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని,భారత్ సర్వమతాల సమ్మేళనం అన్నారు. ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు.జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని,ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు,ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు మంజూరి సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిల్లలమరి శ్రీనివాసు,దేనమకొండ శేషం రాజు,కితా రామనాదం,దేవరం రామ్ రెడ్డి,షేక్ జానీ పాషా,రాంప్రసాద్ గౌడు,ఆర్పి,పెందుర్తి భాస్కరు,బసవోజు శ్రీనివాస చారి,టీవీ ఎల్, దయాకర్ రెడ్డి,కొమరాజు అంజయ్య, దేవవరం వెంకటరెడ్డి,ఇట్టిమల్ల రామకృష్ణ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్