హైదరాబాద్ నగరంలో గతంలో ముంపుకు గురైన ప్రాంతాలలో వెంటనే డీసీల్టింగ్ పనులని త్వరితగతిన పూర్తిచేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది గురి కాకుండా చూడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి కమిషనర్ పైన ఉందని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. ఎన్. గౌతమరావు అన్నారు.
నేడు పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గతంలో ముంపుకు గురైన ప్రాంతాలలో వెంటనే డీసీల్టింగ్ పనులని త్వరితగతిన పూర్తిచేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది గురి కాకుండా చూడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి కమిషనర్ పైన ఉందని అన్నారు.
లేనియెడల కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ధర్నా నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, బిజెపి వెంగల్ రావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్, అధికార ప్రతినిదులు చిట్టి శ్రీధర్, కోలన్ సత్యనారాయణ, సుభాషిని, జ్యోతి రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట