29.7 C
Hyderabad
May 3, 2024 06: 22 AM
Slider నల్గొండ

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్,నియోజకవర్గ కేంద్రంలో CITU నుండి   100మంది హమాలీలు TRSKV లోకి చేరారు. వీరికి స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి TRSKV కండువా కప్పి  ఆహ్వానించారు.

అనంతరం మీడియాతో శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ CM KCR పై అభిమానంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణకు రక్ష సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడి రాష్ట్రాన్ని తెచ్చింది సీఎం కేసీఆర్ అని, తీసుకొచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా రూపు దిద్దుతున్న ఘనత కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదీ లేదని, అందుకోసమే టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు. హుజూర్ నగర్ హమాలీల కోరిన విధంగా కార్మిక భవనానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో TRSKV నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, కార్మిక విభాగ నాయకులు శీలం శ్రీను, పట్టణ  కార్యదర్శి అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫొటో ఫినిష్: టీడీపీ నేతలపై దాడి చేసింది జగన్ మనిషే

Satyam NEWS

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

Satyam NEWS

ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి

Bhavani

Leave a Comment