శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 31న ఆదివారం నిర్వహిస్తున్న 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021కి సంబందించిన పోస్టర్లను రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హునుమతు సాయిరాం,ఏపిడబ్య్లుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ లతో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం ఆమదాలవలసలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తైక్వాండో పోటీల పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాటలుఆడుతు జిల్లా క్రీడాకారులు తైక్వాండో చాంపియన్షిప్లో మంచి ప్రతిభకనబరిచి సత్తా చూపాలని ఆయన కోరారు.
క్రీడలకు ప్రోత్సాహం అందించడం లో తాను ముందు ఉంటాను అని అన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు.
క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని.జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా పోటీలు నిర్వహించాలని వారు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, పోటీల నిర్వాహకులు సుధీర్ వర్మ,వైశ్యరాజు మోహన్ ,తైక్వాండో గౌతమ్ ,తైక్వాండో నవీన్ ,పెయ్యల చంటి,మురళీ తదితరులు పాల్గొన్నారు.