37.2 C
Hyderabad
May 2, 2024 14: 57 PM
Slider ఖమ్మం

రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువ చేయాలి

#khammamtrs

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఖమ్మం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మధిర నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. మధిర నియోజకవర్గంలో నూతన గ్రామ కమిటీలతో నూతన ఉత్సాహం ఏర్పడుతుందని భవిష్యత్తు ఎన్నికలలో విజయానికి నాంది పలుకుతోంది అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10 వరకు మధిర నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలు పూర్తి చేసామని తెలిపారు.

నూతన కమిటీలు ఉత్సాహంగా పని చేసి మరింతగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కోరారు. నూతన కమిటీలతొ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నూతన కమిటీ లు తమ శక్తి వంచన లేకుండా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, పార్టీ మదిర నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

శాల్యూట్: మంచి పాఠాలు నేర్పిన అనుభవం

Satyam NEWS

ఆడపిల్లలకు అప్స ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ

Satyam NEWS

ఏపి హైకోర్టు ‘రివర్స్’ టెండర్ దెబ్బ

Satyam NEWS

Leave a Comment