ఇటీవల గుండె పోటుతో మృతిచెందిన కాప్రా సర్కిల్ పరిదిలోని ఎల్లారెడ్డిగూడలో నివసించే రిపోర్టర్ శ్రీనివాస్ కుటుంబాన్ని కాప్రా ప్రెస్క్లబ్ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్బంగా ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్ధిక సహాయం 50,000 (యబై వేలు) రూపాయలు అందజేశారు.
కార్యక్రమంలో కాప్రా ప్రెస్క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కడియాల రమేష్బాబు, శనిగరం అశోక్, వర్కింగ్ కమిటి అధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి గోపాల్గౌడ, జర్నలిస్టు యూనియన్ నాయకులు మోతె వెంకటరెడ్డి, మెరుగు చంద్రమోహన్, యావాపురం రవి, నర్సింగ్గౌడ్, రమేష్, ఆంజినేయులు , దొమ్మాటి కిరణ్కుమార్రావు, రామచంద్రమూర్తి, శ్రీనివాస్, రమేష్యాదవ్ కలిసి శ్రీనివాస్ తల్లితండ్రులకు, సతీమణికి అందజేశారు.