31.2 C
Hyderabad
May 3, 2024 01: 45 AM
Slider సంపాదకీయం

శాల్యూట్: మంచి పాఠాలు నేర్పిన అనుభవం

#LVSubrahmanyam

ఐఏఎస్ అధికారిగా తన కెరియర్ ఎంతో సంతృప్తినిచ్చిందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయనను సత్యం న్యూస్ పలుకరించింది. విధి నిర్వహణలో భాగంగా తనకు ఎంతో మంది సహకరించారని వారందరికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

కాల ప్రవాహం, వేగంతో సాగిందని ఇప్పుడు అనిపిస్తోందని, ఎంతో మంది శ్రేయోభిలాషులు తన ప్రస్థానంలో చేదోడు వాదోడుగా, తన వెంట ఉన్నారని, వారందరికీ రుణపడి ఉంటానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక అద్భుత ఆశయాన్ని నమ్ముకొని, కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు సాగుతున్న తనను  తన బాగు కోరిన ఎందరో ముందుకు నడిపించారని, తన అనుభవం కూడా ఎంతో నేర్పిందని అయన చెప్పారు.

తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ అయిన మేధావి

కర్మణ్యే వాదికా రస్తే … వంటి గీతా సారాలు తన  చెవుల్లో ప్రతిధ్వనిస్తు తన పయనంలో  మరింత నైతిక స్థైర్యాన్ని అందించాయని ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. 1983 బ్యాచ్ కి చెందిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం అఖిల భారత సర్వీసులో మొదటి ప్రయత్నంలోనే  17వ ర్యాంకు సాధించారు.

నల్గొండ జిల్లాకు శిక్షణకు వెళ్లిన మొదటి అధికారి సుబ్రహ్మణ్యం. 1986లో వరంగల్ జిల్లా ములుగు సబ్-కలెక్టర్ గా పని చేసిన సందర్భంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా భక్తుల మన్ననలు పొందారు. పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఎల్.వి.సుబ్రహ్మణ్యం మూడేళ్ల పాటు పని చేసి గిరిజనుల మౌలిక అంశాలపై దృష్టి పెట్టి సృజనాత్మకమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.

గిరిజనాభివృద్ధికి అద్భుత ప్రణాళికలు

గిరిజన భూములకు సాగునీటి సౌకర్యాలు, పోడు భూములను ఉద్యానవనాలుగా మార్చి అందరి ప్రశంసలు పొందారు. గిరిజన విద్యాభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలు చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొద్ది రోజులు పనిచేశారు. 1990లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయ్యారు. ఈ సందర్బంగా గ్రామీణ, గిరిజన అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

మధ్యలో ఒక సంవత్సరం పాటు బ్రిటన్ లో ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి డిగ్రీ  కోసం యూనివర్సిటీ అఫ్ బ్రాడ్ఫోర్డ్ లో చేరారు. మళ్ళీ భారత్ కి వచ్చాక  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండిగా పని చేసిన సమయంలో భారీ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో కూడుకున్న సాంకేతికతను అమలు చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు.

హైదరాబాద్ నీటి సరఫరా మెరుగుపరిచిన ఘనుడు

1987లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ వైస్ చైర్మన్, ఎండి గా కంప్యూటరీకరణ ద్వారా వినియోగదారులకు మరింత చేరువలో సేవలు ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఏడు మున్సిపాలిటీలలో (ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిథిలో ఉన్నాయి) నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచిన తీరు ప్రజలు, నాయకుల ప్రసంసలు అందుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా ఎల్.వి.సుబ్రహ్మణ్యం హయాంలోనే చేపట్టారు.

2002 లో హైదరాబాద్ లో జరిగిన 32 వ జాతీయ క్రీడలు ప్రతిష్టాత్మకమైనవి. అవి విజయవంతంగా పూర్తి కావడంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాత్ర కీలకం అయింది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణం ఏర్పాటు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నమూనా గా నిలిచింది. తన కనుసన్నల్లోనే రూపుదిద్దుకున్న క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్ధి వల్ల అంతర్జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదిక అయింది.

స్వైన్ ఫ్లూ అదుపు చేయడంలో తనదైన శైలి

పదోన్నతిలో భాగంగా  వైద్య శాఖ, ఆర్ధిక శాఖ లో ముఖ్య కార్యదర్శిగా పని చేసారు ఎల్.వి.సుబ్రహ్మణ్యం. 2006లో స్వైన్ ఫ్లూ ప్రబలినపుడు దానిని ఎదుర్కోడానికి ఆయన చూపిన నాయకత్వ పటిమను ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. మౌలిక రంగ అభివృద్ధిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు ఎల్.వి.సుబ్రహ్మణ్యం.

2007 లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అఫ్ ఏపి (ఇన్కాప్) ఎల్.వి. సుబ్రహ్మణ్యం హయాంలోనే స్థాపన జరిగింది. విమానాశ్రయాల వికేంద్రీకరణ, ఏపి లో గ్యాస్ పైప్ లైన్ల నెట్ వర్క్, ప్రతిష్ఠాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రణాళికల రూపకల్పన చేసి మౌలిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. ఈ 8 లైన్ల రోడ్ నెట్వర్క్ అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక అయింది.

హైదరాబాద్ ఓఆర్ఆర్ రూపకర్త ఎల్వీనే

ఆయన చేపట్టిన ఓఆర్ఆర్ ప్రతిపాదనలే నేడు హైదరాబాద్ కు మణిహారం అయ్యాయి.  తిరుమల తిరుపతి దేవస్థానాలు కి ఎగ్జిక్యూటివ్ అధికారిగా విధులు నిర్వహించారు ఎల్.వి.సుబ్రహ్మణ్యం. తిరుమలేశుని సన్నిధిలో ఒక ఉన్నతాధికారిగా ఆయన అందించిన సేవలు దేవస్థానం అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి.

ధర్మ ప్రచార కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా అమలు చేశారు. ఢిల్లీ, కురుక్షేత్ర, కన్యాకుమారి లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించడానికి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చొరవ తీసుకున్నారు. టీటీడీ పాలనా వ్యవహారాల్లో తనదైన శైలిలో మార్పులు తెచ్చారు.

ఎన్నికల నిర్వహణలో మేటి ప్రతిభ

2019 ఏప్రిల్ 7 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన  ఆదేశాలు మేరకు ఎల్.వి.సుబ్రహ్మణ్యం రాష్ట్ర పాలనలో అత్యున్నతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. సాధారణ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందారు. 2019 నవంబర్ 7వ తేదీన బదిలీ అయ్యాక సెలవుపై వెళ్లారు. ఆయన నేడు రిటైర్  అయ్యారు.  ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే ఎల్.వి.సుబ్రహ్మణ్యం తన సేవలకు గుర్తింపుగా అనేక సంస్థల సత్కార సన్మానాలను అందుకున్నారు.

Related posts

ఇసుకను తరలిస్తున్న టిప్పర్ అడ్డుకున్న రామేశ్వరం గ్రామస్తులు

Satyam NEWS

కొల్లాపూర్ శ్రీ వాణి విద్యా నిలయం లో గాంధీ వర్ధంతి

Satyam NEWS

పారిశుద్ధ్య పనుల్లో ఉండేవారికి ప్రొటెక్షన్ తప్పని సరి

Satyam NEWS

Leave a Comment