ఉప్పల్ డివిజన్ లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. శుక్రవారం డివిజన్ లోని కురుమనగర్ లో రూ.16 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, న్యూ భరత్ నగర్ లో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సీడీపీ నిధులతో చేపట్టనున్నారు. సందర్భంగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పనులను వెంటనే చేపట్టి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శేఖర్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి ,కురుమనగర్ కాలనీ అధ్యక్షులు కంచర్ల కొమురయ్య ,గోవింద్ కుమారస్వామి ,ఉప్పల్ హిల్స్ అధ్యక్షులు అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా