37.2 C
Hyderabad
May 6, 2024 19: 29 PM
Slider మహబూబ్ నగర్

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ సర్కిల్ వెనక ధర్నా నిరసన కార్యక్రమం జరిగింది. తదుపరి పాత బస్టాండ్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి ధరణి పోర్టల్ రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధరణి వెబ్సైట్ నుంచి వస్తున్న సమస్యల గురించి కాంగ్రెస్ నాయకులు వివరించారు. ధరణి వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారని, ధరణి సమస్యలు సృష్టించిన టిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పినా కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకరన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్గెర నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లారెడ్డి, గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్, గట్టు మండల అధ్యక్షులు గౌస్, జిల్లా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వెంకటేష్ ధరణి పోర్టల్ మీద చాలా వివరంగా చాలా చక్కగా రైతులు పడుతున్న బాధల గురించి మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నందు, ధరూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇలియాస్, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ శివరాజ్, గద్వాల్ మైనార్టీ నాయకులు కౌసర్ బేగ్, బంగ్లా శాషా జాంగిర్, ఎస్సీ సెల్ నాయకులు విజయకుమార్, అలెగ్జాండర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిఫాయత్, మా భాష,సోషల్ మీడియా నాయకులు రంజిత్, రాము, వీరేష్, సుధాకర్, మరియు చాలామంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పోలవరం ప్రాజెక్టులో నాటు పడవ బోల్తా: ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

Satyam NEWS

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన

Satyam NEWS

10వ తేదీ నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

Satyam NEWS

Leave a Comment