తిరుమల శ్రీవారిని జూన్ 11వ తేదీ దర్శించుకునే భక్తులకు జూన్ 10వ తేదీ నుండి తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 12 కౌంటర్లలలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని ఆర్టిసి బస్టాండ్, విష్టునివాసం, అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్లలో బుధవారం ఉదయం 5.00 గంటల నుండి దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఒక్కరోజు ముందుగా తిరుపతిలో దర్శనం టోకెన్లు పొందాలి.