38.2 C
Hyderabad
May 1, 2024 22: 04 PM
Slider ఖమ్మం

ఇండ్ల స్థలాలు కోసం 19న ధర్నా

#Dharna

ఖమ్మం నియోజకవర్గంలో అర్హత కలిగిన వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఖాళీ స్థలం వుండి ఇల్లు కట్టుకొనే వారికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 సోమవారం నాడు ఖమ్మం అర్బన్ ఎం ఆర్ ఓ ఆఫీస్ వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు .

సుందరయ్య భవనంలో జరిగిన సిపిఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేవలం రెండు వేల ఒక వంద డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రమే లబ్దిదారులకు అందించారు అని, ఇంకా అర్హత కలిగిన వారు ఖమ్మం నియోజకవర్గంలో వేలాది మంది పేదలు వున్నారని తెలిపారు.

పలు సందర్భాల్లో CPM పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలు కోసం పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే సొంత స్థలం కలిగిన వారికి 3 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ పెండింగ్ లో వుంది అని, గృహ నిర్మాణం రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ ఇళ్లు సమస్యలపై సోమవారం జరిగే ధర్నాలో పేదలు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరార.

Related posts

వాంటెడ్ హ్యాంగ్ మెన్: ఉరి తీసేందుకు తలారీలు కావాలి

Satyam NEWS

నరసరావుపేట నియోజకవర్గంలో టిడిపి ఎన్నికలు పూర్తి

Satyam NEWS

ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న సీబీఐ

Satyam NEWS

Leave a Comment