నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త సాయి మందిరములో ఈరోజు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తో కలసి సాయిబాబా మందిరం లోని నూతనంగా నిర్మించిన ధూని మందిరాంలో అగ్ని ప్రతిష్టి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవుడికి మంచి విద్యాబుద్ధులు సద్ బుద్దుని ఇచ్చేవారు గురువు అలాంటి గురువు దేవాలయంలో సాయిబాబా దేవాలయంలో తనలో ఉన్న చెడు గుణాలు అన్నింటిని కూడా తొలగించి మంచి బుద్ధిని కలిగించాలనే ఉద్దేశంతో భక్తులు ఈ ధూనిలో నవధాన్యాలు కొబ్బరికాయ మరియు ఇతర పదార్థాలను వేసి తనలో ఉన్న చెడు బుద్ధులను కూడా తొలగిపోవని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ధూని మందిరాన్ని ప్రతిష్టించడం సంతోషదాయకమైన అన్నారు.
నిర్మల్ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఈ సందర్భంగా మంత్రి కోరారు.